నవతెలంగాణ - సదాశివనగర్ మండలంలోని ప్రతి గ్రామంలో గురువారం గ్రామసభలు నిర్వహించారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై గ్రామ సభలు నిర్వహించారు గ్రామసభ ప్రారంభంలో తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
అనంతరం సర్పంచులు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రసంగించారు. రైతు భరోసా మహాలక్ష్మి పింఛన్లు కళ్యాణ్ లక్ష్మి సమావేశం నిర్వహించారు. జనగామలో సర్పంచ్ మధుబాయ్ లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ లావణ్య రమేష్ అమర్ల బండలో బాలరాజు, పద్మాజీ వాడిలో లోకోటి సుబ్బారావు, సదాశివనారుల శిరీష, రవి, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, ఉప సర్పంచ్ ను వార్డు మెంబర్లు, ఏఎన్ఎంలు, వ్యవసాయ అధికారులు, ఐకెపి, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

