ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలిఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీలకి పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
కూలీలకి తప్పనిసరిగా త్రాగడానికి నీరు, నిలువ నీడ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేబర్ పని దినాలతో పాటు, ఇతర లక్ష్యాలను కూడా సకాలంలో సాధించాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జెడ్పి సీఈఓ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిఆర్డిఓ ఉమాదేవి, సిపిఓ హరికృష్ణ, మాస్టర్ ట్రైనర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

