నవతెలంగాణ-మల్హర్ రావుకాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మండలం ఇప్పలపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అబ్బినేని లింగుస్వామి,ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ భాష,సాహిత్యం, సంస్కృతి,సామాజిక చైతన్యం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.ఆయన ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి,జీపీ సిబ్బంది,అంగన్ వాడి సిబ్బంది పాల్గొన్నారు.

