Dailyhunt
జేఈఈ అడ్వాన్స్లో ఆకాష్ విద్యార్థులకు టాప్ ర్యాంక్లు

జేఈఈ అడ్వాన్స్లో ఆకాష్ విద్యార్థులకు టాప్ ర్యాంక్లు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన తమ ఇద్దరు విద్యార్థులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ 2021 పరీక్షా ఫలితాలలో టాప్‌ 500లో పలు ర్యాంకులను సాధించారని ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

టాప్‌ 500లో ర్యాంకులను సాధించిన విద్యార్ధులలో గౌతమ్‌సింగ్‌ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 191 సాధించగా, శ్రీ నికేతన్‌ జోషి 491వ ర్యాంక్‌ పొందారని పేర్కొంది. ఈ ఇరువురు విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌లో చేరారని తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana