నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు భూచర జీవిగా 'జోనాథన్' అనే తాబేలు గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. సుమారు 194 ఏళ్ల వయసున్న జోనాథన్, 1832లో జన్మించినట్లు అంచనా.
ప్రస్తుతం వయసు రీత్యా కంటిచూపు మందగించడం, వాసన శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, అది ఆరోగ్యంగానే ఉంది. ఈ అల్డాబ్రా జాతికి చెందిన భారీ తాబేలు సెషెల్స్లో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా సెషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మోడీ, ఈ సందర్భంగా అక్కడి జాతీయ బొటానికల్ గార్డెన్స్ను సందర్శించి ఈ అరుదైన జీవిని చూశారు.

