Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్మిక శాఖ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి

కార్మిక శాఖ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి

- ఐఎఫ్టియు పిలుపు నవతెలంగాణ డిచ్ పల్లి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక నాలుగు కోడ్ బిల్లులను రద్దు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ లో పనిచేస్తున్న వారికి పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా లేబర్ కార్యాలయం ముందు జరిగే ముట్టడి, ధర్నాను విజయవంతం చేయాలని యూనివర్సిటీ యున యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎల్ బి రవికుమార్ అన్నారు.

శనివారం తెలంగాణ యునివర్సిటీ ఔట్ సోర్సింగ్ (ఐఎఫ్టియు అనుబంధం ) యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎల్ బి రవి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మిక ఉద్యోగులకు రక్షణ గా ఉన్న చట్టాలను మారుస్తూ కేవలం శ్రమ దోపిడీ చేయడం కోసం ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచాలనే ప్రతిపాదన చేయడం సిగ్గుచేటని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేటికీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిపైనే పని భారం ఎక్కువ పడుతున్నా వారికి కనీస వేతనాలు కూడా దక్కడం లేదని వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో ఈనెల 25న జరిగే ఎటువంటి ముట్టడి ధర్నా కార్యక్రమాన్ని కార్మిక ఉద్యోగులందరూ వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు సురేష్, బీకోజి, ఉపాధ్యక్షులు నరేష్, కోశాధికారి నరేష్ రవి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana