- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శేఖర్
- మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - చొప్పదండి
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం చొప్పదండి మున్సిపల్ కార్యలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా శేఖర్ మాట్లాడుతూ.. కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో మృతిచెందిన మున్సిపల్ కార్మికుడు బత్తిని హన్మండ్లు కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు సమస్యలను వివరించారు.

