నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాతృమూర్తి వరలక్ష్మి(91) హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో గురువారం మధ్యా హ్నం మృతిచెందారు. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన ఆమె 15 రోజులుగా చికిత్స పొందారు. ఆమె మృతదేహాన్ని గురువారం రాత్రి ఖమ్మం తీసుకొ చ్చారు. ఖమ్మంరూరల్ మండలం గొల్లగూడెంలోని మధుకాన్ గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నీ తానై నామ నాగేశ్వరరావు ఎదుగుదలకు తోడ్పాటునందిచ్చిన ఆమె ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు చేరువయ్యారు.

