మహబూబ్నగర్: పోలీసులు ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకోసం నిరంతరం పని చేస్తుంటారని ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పని చేస్తా రని చెప్పారు.
ప్రజల భద్రతకోసమే పోలీసులు ఉన్నారన్న నమ్మకం కల్పించడం కోసమే ఇలాంటి తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. మీకు తెలియకుండా మీ కాలనీలలో సంఘవిద్రోహులు చేరి సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవ కాశం ఉంటుందని, ఇలాంటి ఆకస్మిక తనిఖీల వల్ల అలాంటి వారు ఆశ్రయం పొందితే వారిని అదుపు లోకి తీసుకుంటామన్నారు. ఈతనిఖీల వల్ల సామా న్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎవరికైనా ఇళ్ళను అద్దెకిస్తే వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే ఇళ్ళను ఇవ్వాలని సూచిం చారు. గుర్తు తెలియని వారు, అనుమానాస్పదంగా కాలనీలలో తిరిగేవారి సమాచారం వెంటనే పోలీ సులకు తెలుపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
