నవతెలంగాణ - హైదరాబాద్ : మెక్సికోలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్విట్జింగో ప్రాంతంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 10 మంది మృతి చెందారు.
మృతుల్లో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.

