నవతెలంగాణ - మల్హర్ రావుమండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన డేగరి రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ మృతురాలు కుటుంబాన్ని బుధవారం పరమార్శించి రూ.2 వేలు ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీస్వామి, కాగ్రెస్ పార్టీ ఎడ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మిరాజు, వార్డు సభ్యులు చెన్నబోయిన సుగుణ లక్ష్మణ్, తోకల రమా సమ్మయ్య, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

