నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా రాష్ట్రంలో నేటి నుంచి రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని IMD వెల్లడించింది.
ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరించింది.

