నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 2021-22 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు బుధవారం సీపీజీఈటీ కన్వీనర్ ఎల్ పాండురంగారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాతపరీక్షలు ఆన్లైన్లో సెప్టెంబర్ 18, 21, 27తోపాటు అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. 78,312 మంది దరఖాస్తు చేయగా, రాతపరీక్షలకు 68,836 మంది హాజరయ్యారని వివరించారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 2021-22 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు బుధవారం సీపీజీఈటీ కన్వీనర్ ఎల్ పాండురంగారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాతపరీక్షలు ఆన్లైన్లో సెప్టెంబర్ 18, 21, 27తోపాటు అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. 78,312 మంది దరఖాస్తు చేయగా, రాతపరీక్షలకు 68,836 మంది హాజరయ్యారని వివరించారు.
