' సప్పగా సాగిన పరకాల మున్సిపల్ సమావేశంప్రణాళిక లేని సమావేశాలు ఎందుకంటూ
పెదవి తీరుస్తున్న పట్టణ ప్రజలు
నవతెలంగాణ - పరకాల
పరకాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం ఎటువంటి కీలక నిర్ణయాలు, అర్థవంతమైన చర్చలు లేకుండానే సప్పగా ముగిసింది.
నగర అభివృద్ధిపై సభ్యులు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పటికీ, వాటికి సరైన ప్రాధాన్యత దక్కలేదని, కేవలం తూతూ మంత్రంగానే సమావేశం సాగిందని పలువురు కౌన్సిలర్లే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
పట్టణ అభివృద్ధికి నిధులు ఉన్నా, వాటిని సద్వినియోగం చేయడంలో పాలకవర్గం చూపుతున్న నిర్లక్ష్యంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి సమావేశంలోనైనా సమస్యలపై గట్టిగా చర్చించి, అభివృద్ధిని పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి.

