Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ రద్దు..NTA కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళన

నీట్ రద్దు..NTA కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళన

వతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 3న నిర్వహించిన నీట్(NEET)-యూజీ పరీక్ష రద్దైన విషయం తెలిసిందే. రాజస్థాన్లో పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది.

వచ్చే నెల జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. నీట్ పేపర్ లీక్జీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు భగ్గుమంటున్నాయి. మోడీ సర్కార్ నిర్లక్ష్యంతో పదే పదే నీట్ పేపర్ లీక్ అవుతుందని మండిపడుతున్నాయి.

తాజాగా ఢిల్లీలో NTA ఆఫీస్ ఎదుట విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టాయి. NTAను రద్దు చేయాలని, విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని NSUI డిమాండ్ చేసింది. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించి స్థానిక పీఎస్లకు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana