Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ.

పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ.

వతెలంగాణ - డిచ్ పల్లి : డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని మిట్టపల్లి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీనియర్ డీజీఎం ప్రభాకర్ గురువారం పాల్గోని ప్రారంభించారు.

డిచ్ పల్లి రైల్వే స్టేషన్ ఏరియాల్లో పవర్ గ్రిడ్ ఉద్యోగులు అందరు కలిసి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సీనియర్ డీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా తమ సంస్థ ఉద్యోగులు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.15 రోజులపాటు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ చంద్ర మౌళి, అనిల్, జేఈ కలీముల్లా, గ్రిడ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana