Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోక్సో కేసులో భగీరథ్ ముందస్తు బెయిలు పిటిషన్పై నేడు నిర్ణయం

పోక్సో కేసులో భగీరథ్ ముందస్తు బెయిలు పిటిషన్పై నేడు నిర్ణయం

వతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీసుస్టేషన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు బెయిలు పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం ఇస్తామంటూ హైకోర్టు స్పష్టంచేసింది.

పిటిషనర్ భగీరథ్ వాదనలతోపాటు బాధితురాలి(ఫిర్యాదుదారు) వాదనలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామంది. శుక్రవారం వరకు రక్షణ కల్పించాలన్న పిటిషనర్ అభ్యర్థనకు నిరాకరిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రధాన ముందస్తు బెయిలు పిటిషన్పై వేసవి సెలవుల తర్వాతే విచారిస్తామంది. బాధితురాలి పుట్టిన తేదీకి సంబంధించి స్పష్టత ఇస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. పోక్సో కేసులో ముందస్తు బెయిలు కోరుతూ సాయి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి, ఫిర్యాదుదారు తరఫున సీనియర్ న్యాయవాది పి.నాగేశ్వరరావు తమ వాదనలు వినిపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana