- రూ.10వేలు దాటిన క్వింటా సోయాబీన్స్
న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్లో సోయాబీన్స్ ధరలు రికార్డు స్థాయిలో నమోదుకావటం పౌల్ట్రీరంగానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రొటీన్ పెద్దమొత్తంలో ఉండే సోయాబీన్స్ను చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమలో దాణాగా వాడతారు. సోయాబీన్స్ వాడిన దాన్నిబట్టే కోళ్ల ఎదుగుదల, గుడ్ల సంఖ్య ఆధారపడి ఉంటుందని, మార్కెట్లో క్వింటా సోయాబీన్స్ రూ.10వేలు (ఇండోర్ మార్కెట్లో) దాటడంతో నిర్వహణ వ్యయం పెరిగిపోయిందని పౌల్ట్రీ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సోయాబీన్స్ దిగుమతులపై కేంద్రం కస్టం సుంకం తగ్గిస్తేనే ధరలు తగ్గుముఖం పడతాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

