- సీఐటీయూ జిల్లా నాయకులు కీలుకానీ లక్ష్మణ్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఆదివారం నిర్వహించనున్న సేవ్ ఇండియా కోసం చేపడుతున్న జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కీలుకానీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వాలు వారికి గుదిబండగా మారాయని విమర్శించారు. పెట్రోలు ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గిపోయినా తమ ప్రభుత్వాలు మాత్రం రోజురోజుకూ ధరలు పెంచుతూ.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతుండంతో పేద, మధ్య తరగతి ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందో ళన వ్యక్తంచేశారు.
