శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పెద్దినాయుడుపేట వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోల్తాపడిన బస్సు బెంగళూరు నుంచి కలకత్తా వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

