వీరమల్ల శిరీష-లోకేష్ గౌడ్, మర్రిగూడ సర్పంచ్నవతెలంగాణ-మర్రిగూడ
ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతున్న నవతెలంగాణ దినప్రతికకు మండల పరిధిలోని మర్రిగూడ సర్పంచ్ శిరీషా-లోకేష్ గౌడ్ 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
'ప్రజల పత్రిక నవతెలంగాణ. ప్రజల కష్టనష్టాలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నది. నిరంతరం ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతున్నది. కార్మిక, కర్షక, ప్రజా పోరాటాలు, ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తుంది. నవతెలంగాణ పత్రిక 11వ వార్షికోత్సవం నేపథ్యంలో యాజమాన్యం, ఉద్యోగులు, సిబ్బంది, జర్నలిస్టులకు శుభాకాంక్షలు.పత్రిక మరింత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని తెలిపారు.

