నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం పోలీసు కమిషనర్గా సీఐడీ డీఐజీ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న చంద్రశేఖర్రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏసీపీ జాయింట్ డైరెక్టర్ రమణకుమార్ను సంగా రెడ్డి జిల్లా ఎస్పీగా నియమిస్తు ఆదేశాలు జారీ చేశారు.