- ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వారంలో రెట్టింపు
- సౌకర్యాల కల్పనపై పెరిగిన హడావుడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా దిశను మార్చుకున్నది. ఇంత కాలం జీహెచ్ఎంసీని హడలెత్తించిన ఈ కేసులు ప్రస్తుతం జిల్లాలను వణికిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఐదు నుంచి 10 శాతం లోపు పాజిటివ్ రేటు నమో దవుతుండగా, జిల్లాల్లో మాత్రం క్రమక్రమంగా పెరు గుతున్నది. గత 10 రోజులుగా ఒకట్రెండు చోట్ల తప్ప మిగిలిన అన్ని కేంద్రాల్లో బాధితుల సంఖ్య రోజుల గడుస్తున్నా కొద్ది రోగులు పెరుగు తుండ డంతో ఆందోళన నెలకొన్నది. జిల్లాల వారీ గణాం కాల ఆధారంగా రానున్న కొద్ది రోజుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా కేసులు భారీగా వెలు గు చూసే అకాశముందని వైద్యారోగ్యశాఖ అం చనా.
మూడు దశల్లో కరోనా వ్యాప్తి
కరోనా వ్యాప్తి మూడు దశల్లో ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుదల దశ దాటి స్థిరంగా ఉందనీ, ఇది క్రమేణా బలహీనపడి కేసులు కూడా తక్కువగానే వస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో జిల్లాల్లో స్థాయిలో పెరుగుతున్నాయనీ, ఈ దశలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా, ఏరియా ఆస్పత్రుల స్థాయిలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల స్థా యిలో కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచేం దుకు వైద్యారోగ్యశాఖ హడావుడీ చేస్తున్నది. ఈ పను లను మరింత వేగవంతం చేస్తే తప్ప పట్టణ ప్రాం తాల్లో జరిగిన నష్టం పునరావతం కాకుండా ఉంటుం దని పలువురు సూచిస్తున్నారు.
జాగ్రత్తలే శిరోధార్యం : తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లకపోవ డం, వెళ్లిన సమయంలో మా స్కు ధరించడం, పిల్లలు, వద్ధులు, దీర్ఘకాలిక వ్యాధు లతో బాధపడు తున్న వారు జాగ్రత్తలు తీసుకో వడమే ఉత్తమ మని డాక్టర్స్ ఫర్ సేవా ప్రతినిధి డాక్టర్ పి.శ్రీకాంత్ సూచించారు.
