నవతెలంగాణ - హైదరాబాద్ : విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఎల్లుండి(శుక్రవారం) వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి.
బంద్ ప్రభావం కారణంగా విద్యాసంస్థలు మూతపడే అవకాశం ఉంది. జూలై 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే బంద్ అమలు స్థానిక పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

