- రాజకీయ ఒత్తిళ్లతో కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులు
నవతెలంగాణ-రాంనగర్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ ప్రధాన రహదారిపై ఉన్న స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మెనూ విష యమై జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వాన గా మారింది. మంగళవారం రాత్రి సుమారు 20 మంది యువకులు మద్యం మత్తులో కర్రలతో ఫాస్ట్ఫుడ్ సెంటర్పై విచక్షణ రహితంగా దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ దాడిలో పాస్పోర్ట్ సెంటర్ ఉద్యోగి దీపక్ యజమాని పర్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయాలపాలయ్యారు.రాజకీయ ఒత్తిళ్లతో నిందితులను అరెస్టు చేయడం లేదని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

