Dailyhunt

తుంగభద్ర డ్యాంకు పెరిగిన వరద

హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు.

సోమవారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 27,507 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 23,645 క్యూసె క్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్‌లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana