Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కోసమే వీబీజీ రాంజీ: సీపీఐ(ఎం)

ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కోసమే వీబీజీ రాంజీ: సీపీఐ(ఎం)

వతెలంగాణ-తుంగతుర్తిఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసమే వీబిజీ రాంజీ గా మార్చి కూలీల పొట్ట కొట్టడం కోసం ప్రయత్నం చేస్తుందని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాసు విమర్శించారు.

సోమవారం తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పని దగ్గర చేరి అక్కడ కూలీలతో మాట్లాడి వారికి జరుగుతున్న బాధలను తెలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల మీద ఉన్న శ్రద్ధను దేశంలో ఉన్న వ్యవసాయ కార్మికులపై ఏమాత్రం చూపడం లేదని విమర్శించారు. రెండు పూటలా ఫోటో కార్యక్రమం ద్వారా పని ప్రదేశానికి సకాలంలో ఒక్కరే ఫోటో తీయడం కోసం చాలా ఆలస్యమవుతుందని, కూలీలు ఎంతో కాలాన్ని వృధా చేసుకోవడం జరుగుతుందని వెంటనే ఈ రెండు ఫోటోల కార్యక్రమాన్ని రద్దు చేయాలని అన్నారు.

పని దగ్గర కూలీలకు వసతులను కల్పించడం లేదని, పనిముట్లని ఇవ్వడం లేదని, కనీసం తాగడం కోసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొంత శాతం రాష్ట్ర ప్రభుత్వం మీద పడేయకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి కూలికి కనీసం రూ.500 రోజుకు పడే విధంగా చూడాలని అన్నారు. పనిచేసే సమయంలో కూలీలు ప్రమాదవశాత్తు గురైతే తాత్కాలిక ట్రీట్మెంట్ చేయడం కోసం మెడికల్ కిట్టు అందుబాటులో ఉండాలని సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని అన్నారు. పనిచేసే సందర్భంగా కూలి గాయాల గురైయితే ఆ 200 రోజుల కూలీ అట్టి వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా అనేకమంది పేద మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజలు కొంత ఉపశమనంకి పొంది వారి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా ఉన్నందున ఈ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా కాపాడాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక నాయకులు నల్లమాస ఎన్టీఆర్, యాదయ్య, పూసపెల్లి వెంకన్న,దొంగరి నరసయ్య, శ్రీకాంత్, మహేష్, కళ్యాణి, చిలకమ్మ, శోభ, జయమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana