Dailyhunt

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

విజయవాడ: నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో నగరపాలక, పుర, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. అందులో వైస్ఆర్సీపీ 570 స్థానాలను కైవసం చేసుకోగా, టీడీపీ ఐదు స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఒక చోట భాజపా, రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎస్ఈసీ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana