Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు అధికారికం ప్రకటించిన విజయసాయిరెడ్డి

NAVYA MEDIA 1 day ago

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మార్పుల దిశగా వైసీపీ మాజీ ఎంపీ వేణుంభాక విజయసాయిరెడ్డి ఈరోజు (సెప్టెంబర్ 7, 2026) విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రాబోయే దసరా పండుగ (విజయదశమి) రోజున పార్టీ పేరు, జెండాను అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ మూడో కూటమిని తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను స్థాపించే కొత్త పార్టీకి తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే తరహాలో తాను పార్టీకి కేవలం ఒక ‘మెంటర్‌’ (సలహాదారు)గా వెనుక ఉండి నడిపిస్తానని, తాగానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి పదవులను చేపట్టబోమని తేల్చిచెప్పారు.

ఏపీలో అధికారం కేవలం రెడ్డి, కమ్మ అనే రెండు కులాలు, రెండు కుటుంబాల చేతుల్లోనే మారుతోందని విమర్శించారు. ఇతర వెనుకబడిన కులాల్లో (బీసీల్లో) సామర్థ్యం ఉన్న నాయకులకు పెద్దపీట వేసి, వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

టీడీపీ, వైసీపీలు తమకు కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కాదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో 66 శాతం వరకు అవకాశాలను యువతకే కేటాయించనున్నట్లు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia