ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలం గురించి అందరికి తెలిసిందే. అయితే ఈరోజు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. నివర్ తుఫాన్ ప్రభావాన్ని, జరిగిన నష్టాన్ని కేబినెట్కు వివరించారు అధికారులు. సుమారు 40 వేల హెక్టార్లల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేయగా. రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందినట్టు వెల్లడించారు. అయితే, పంట నష్టాన్ని వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. డిసెంబర్ నెలాఖరులోగా నష్ట పరిహారం అందించాలని స్పష్టం చేశారు.. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సూచించిన ఆయన.. ఎన్జీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు.

