Dailyhunt
ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు

ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు

NAVYA MEDIA 1 week ago

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి శాలువా కప్పి, ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026 బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలోనూ ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకే లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. 2014 నాటి పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను సవరిస్తూ ‘కొత్త రాజధాని’ అనే పదం స్థానంలో ‘అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది.

తన పర్యటనలో భాగంగా లోకేశ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia