Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధాని నరేంద్ర మోదీకి  స్వీడన్ అత్యున్నత  అవార్డు బహుకరించిన  స్వీడన్ ప్రధానమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ అత్యున్నత అవార్డు బహుకరించిన స్వీడన్ ప్రధానమంత్రి

NAVYA MEDIA 6 days ago

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ నగరానికి చేరుకుని, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్‌తో మరియు యువరాణి విక్టోరియాతో కీలక సమావేశాలు జరిపారు.

ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుతూ ఇరు నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

స్వీడన్ అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ అవార్డును ప్రధాని మోదీకి అందించారు.

స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్తాఫ్ తరపున యువరాణి విక్టోరియా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి స్వయంగా బహూకరించారు.

ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి ఆసియా దేశ నేతగా ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ అవార్డును ఆయన 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేశారు.

స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్‌తో జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో రక్షణ, కృత్రిమ మేధస్సు (AI), గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, వాణిజ్యం మరియు హెల్త్‌కేర్ రంగాల్లో సహకారంపై విస్తృతంగా చర్చించారు.

రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య పెట్టుబడులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా సరికొత్త ‘జాయింట్ యాక్షన్ ప్లాన్ 2026-2030’ కి ఆమోదం తెలిపారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ కింద స్వీడిష్ కంపెనీలకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు.

ప్రధాని మోదీ, స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ మరియు యువరాణి విక్టోరియా సంయుక్తంగా స్వీడన్‌కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో (CEOs) మరియు వ్యాపార ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వోల్వో (Volvo), సాబ్ (Saab) వంటి అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలు భారత్‌లో మరింతగా ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ రంగాల్లో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.

ఈ భేటీ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటనకు (1926) వందేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నేతలు ప్రత్యేక బహుమతులు మార్చుకున్నారు.

ప్రధాని మోదీ యువరాణి విక్టోరియాకు భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే ‘గోండ్ పెయింటింగ్’ మరియు ఒక ప్రత్యేక పుస్తకాన్ని బహుమతిగా అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia