ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు.
ఆగస్టు 19, 20 న (బుధ, గురువారాలు) ఈ పర్యటన కొనసాగుతుంది.
దక్షిణ భారత రాష్ట్రాల 'సదరన్ జోనల్ కౌన్సిల్' అధికారిక సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు కీలక మరియు అభివృద్ధి అంశాలపై సీఎం మాట్లాడనున్నారు.
పర్యటన షెడ్యూల్ఆగస్టు 19 (బుధవారం) సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరుతారు.
ఆగస్టు 19 రాత్రి చెన్నై చేరుకుని, ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.ఆగస్టు 20 (గురువారం): రోజంతా చెన్నైలో జరిగే అధికారిక కౌన్సిల్ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు..

