తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత మరియు వడగాల్పులు ఎక్కువగా పెరుగుతాయని వాతావరణ శాఖ (IMD), విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ASF, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, NLG, సూర్యాపేట, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు, మహబూబూబాద్ జిల్లాల్లో 45-47 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అవుతుందని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని APSDMA తెలిపింది. అత్యవసరమైతే తప్ప 11AM-4PM వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

