Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
100 సీట్లు దోచేశారు..బీజేపీ 'ప్లేబుక్'అదే..రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!

100 సీట్లు దోచేశారు..బీజేపీ 'ప్లేబుక్'అదే..రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!

శ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) మరియు ఎన్నికల సంఘం (EC) లక్ష్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల తీర్పును బీజేపీ అక్రమంగా దొంగిలించిందని, దీనికి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సహకరించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో 100కు పైగా స్థానాలను బీజేపీ అపహరించిందన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.

బీజేపీ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర మరియు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా 'ప్లేబుక్' అనుసరించారని ఆయన విమర్శించారు. "ఎన్నికల చోరీ, వ్యవస్థల చోరీ.. ఇక మిగిలిందేముంది!" అంటూ హిందీలో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, రాజ్యాంగబద్ధమైన సంస్థలను గుప్పిట్లోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. విపక్షాలన్నీ ఏకమై వ్యవస్థల దుర్వినియోగంపై పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu