ప్రైవేట్ వాహనంలో నేపాల్కు రోడ్డు ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉన్నారా? నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త 'ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్', 'క్యూఆర్ (QR) ఆధారిత ఎంట్రీ' కారణంగా, భారతీయ వాహనాలు ఇకపై సరిహద్దుల వద్ద పర్మిట్ల కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు.
ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో నేపాల్కు వెళ్లేవారు తాత్కాలిక వాహన అనుమతి (పర్మిట్) పొందడానికి కస్టమ్స్ చెక్పోస్టుల వద్ద క్యూలో నిలబడి ఎంతో సమయం వృధా చేసుకునేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ చేశారు. ప్రయాణికులు ఇంటి వద్ద నుండే తమ వాహన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, నిర్ణీత రుసుము చెల్లించి క్యూఆర్ (QR) కోడ్ను పొందవచ్చు. సరిహద్దు వద్ద ఈ క్యూఆర్ కోడ్ను చూపించి ప్రయాణాన్ని సజావుగా కొనసాగించవచ్చు. ఒకవేళ ప్రయాణికులు తమ ప్రయాణ వ్యవధి ముగిసిన తర్వాత కూడా నేపాల్ లో బసను పొడిగించాలనుకుంటే, పర్మిట్ను నేపాల్ లోపల నుండే ఆన్లైన్లో సులభంగా రెన్యువల్ చేసుకోవచ్చు. దీనికోసం మళ్ళీ కస్టమ్స్ ఆఫీస్ల చుట్టూ తిరగాల్సిన లేదా పెనాల్టీలు కట్టాల్సిన అవసరం లేదు. పర్యాటకులకు వేగవంతమైన, పారదర్శకమైన, మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే ఈ విధానాన్ని ప్రారంభించారు.

