Dailyhunt
ఏపీలో 7 వేలు దాటిన కరోనా మరణాలు

ఏపీలో 7 వేలు దాటిన కరోనా మరణాలు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 663 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,003కు చేరగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,69,412కు చేరింది. తాజాగా 1,159 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6,924 యాక్టివ్‌ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,01,66,696 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 106 పాజిటివ్‌ కేసులు, వెస్ట్‌ గోదావరి 96 కేసులు, గుంటూరు 86, ఈస్ట్‌ గోదావరి 60 కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో యాబై లోపు కేసులు నమోదయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu