Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూబ్లీహిల్స్ 'రిచ్ కిడ్స్ ట్రాప్' కేసు..తొమ్మిదో నిందితుడి అరెస్ట్

జూబ్లీహిల్స్ 'రిచ్ కిడ్స్ ట్రాప్' కేసు..తొమ్మిదో నిందితుడి అరెస్ట్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పరిధిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక వేధింపుల కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన జితేందర్ రెడ్డి అలియాస్ జతిన్‌ను అదుపులోకి తీసుకుని, అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికతో జతిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను నమ్మించి జూబ్లీహిల్స్‌లోని ఒక డ్రైవ్-ఇన్ ప్రాంతంలో కలుసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం మియాపూర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బాలికకు తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీశాడు.

ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను నిందితుడు తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరించి, ఆమె నుంచి సుమారు రూ.2.48 లక్షలు వసూలు చేశాడు. జతిన్‌తో పాటు అతని స్నేహితులు కూడా ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని బాలికను వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

నిందితుల వేధింపులు భరించలేకపోయిన సదరు మైనర్ బాలిక ఇటీవల ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ "రిచ్ కిడ్స్ ట్రాప్" వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు జతిన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu