ప్రభుత్వ ఉద్యోగం రాగానే భార్య తనను, తమ 10 ఏళ్ల కొడుకును వదిలేసి వెళ్లిపోయిందని బీహార్లోని హాజీపూర్కు చెందిన ఒక వ్యక్తి ఆరోపించారు. ఆమె చదువు కోసం తాను వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మానని, కానీ ఆమె ఇప్పుడు వేరుగా ఉంటూ మరో ఉపాధ్యాయుడితో సంబంధం పెట్టుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమన్ కుమార్, గుంజన్ కుమారిలకు 2013లో వివాహం జరిగింది. వీరికి ఆరుష్ ఆర్య అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయానికి గుంజన్ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివింది, కానీ ఆమెకు ఉపాధ్యాయురాలు కావాలని ఆశ ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అమన్ కూలీగా పనిచేస్తూ ఆమె చదువుకు అండగా నిలిచాడు.
ఆమె చదువుల కోసం 2022లో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కూడా అమ్మినట్లు అమన్ తెలిపాడు. భర్త ప్రోత్సాహంతో గుంజన్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసి బీపీఎస్సీ (BPSC) టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె TRE-02 రిక్రూట్మెంట్ ద్వారా 6 నుండి 8వ తరగతి ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత బిదుపూర్ బ్లాక్లోని ఓ పాఠశాలలో పోస్టింగ్ పొందింది.

