Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాత్రి 8 గంటలకల్లా మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూసివేయాలి.. కొత్త మార్గ దర్శకాలు విడుదల

రాత్రి 8 గంటలకల్లా మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూసివేయాలి.. కొత్త మార్గ దర్శకాలు విడుదల

శ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సోమవారం నుండి వ్యాపార సంస్థలను రాత్రి 8 గంటలకల్లా మూసివేయాలనే కొత్త మార్గ దర్శకాలను విధించింది.

డిప్యూటీ కమిషనర్ ఇర్ఫాన్ మెమన్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం, కొత్త మార్కెట్ మూసివేత సమయాలు వారంలోని ప్రతి రోజు వర్తిస్తాయని సోషల్ మీడియాలో ప్రకటించింది. మార్కెట్లను రాత్రి 8 గంటలకల్లా మూసివేయాలి, అయితే రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండవచ్చని పేర్కొన్నారు.

"కొనసాగుతున్న ఖర్చుల తగ్గింపు చర్యలలో భాగంగా ఇస్లామాబాద్ జిల్లా యంత్రాంగం జూన్ 1, 2026 నుండి సవరించిన వ్యాపార సమయాలను అమలు చేసింది. మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ రాత్రి 8:00 గంటలకు మూసివేయబడతాయి, అయితే రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, ఇతర తినుబండారాలు లభ్యమయ్యే ప్రదేశాలు రాత్రి 10:00 గంటల వరకు తెరిచి ఉంటాయి," అని X లోని పోస్ట్ పేర్కొంది.

ఇంకా వివాహ మందిరాలు, పందిళ్లు, ఇతర కార్యక్రమాల వేదికలు కూడా రాత్రి 10:00 గంటలకు మూసివేయబడతాయి. ఫార్మసీలు, ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, పాల దుకాణాలు, క్రీడా సౌకర్యాలు, కాల్ సెంటర్లు, అంతర్జాతీయ ఖాతాదారులకు సేవలు అందించే ఐటీ కంపెనీలతో సహా అత్యవసర సేవలకు ఈ పరిమితుల నుండి మినహాయింపు ఉంటుంది" అని అది పేర్కొంది.

ఈ పరిమితులు ప్రైవేట్ ఆస్తులలో జరిగే కార్యక్రమాలు, సమావేశాలకు కూడా వర్తిస్తాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి అనంతరం ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో, పని గంటలను తగ్గించాలని మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశించడంతో సహా, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు కూడా తీసుకుంది.

చాలా మార్కెట్లు సాధారణంగా మధ్యాహ్నం పూట తెరుచుకుని రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతాయి కాబట్టి, వ్యాపారులు, సంస్థలు సాంప్రదాయకంగా ఇటువంటి చర్యలను వ్యతిరేకిస్తూ వచ్చాయి. పాకిస్తాన్ తన ఇంధన అవసరాల కోసం హోర్ముజ్ జలసంధిపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ సంక్షోభ సమయంలో కొన్ని ట్యాంకర్లను అనుమతించినప్పటికీ, పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల కారణంగా రవాణా అధిక ధరకు జరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu