ఐపీఎల్ 2026లో మే 5న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే పరిస్థితి ఉంది.
మ్యాచ్కు కొన్ని గంటలకు ముందు కూడా ఢిల్లీలో భారీ వడగండ్ల వాన కురిసింది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు కూడా వాతావరణం ప్రతికూలంగానే ఉండటంతో మ్యాచ్ జరగడంపై అనిశ్చితి నెలకొంది.
ప్రస్తుతం సీఎస్కే, ఢిల్లీ తలో 9 మ్యాచ్ల్లో నాలుగేసి విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.

