Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీకి బిగ్ షాక్.. కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్!

వైసీపీకి బిగ్ షాక్.. కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్!

పొగాకు వ్యాపారి కుమారుడు అభి కిడ్నాప్ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను గుజరాత్‌లో నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుతో పాటు ఆయనపై మరికొన్ని కిడ్నాప్ కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. గుంటూరులో పొగాకు గోదాము నిర్వహించే ముస్తఫాకు, ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన వ్యాపారి కడిమి సూర్యచంద్రం క్రమం తప్పకుండా పొగాకు సరఫరా చేసేవారు. అయితే, ఇటీవల ముస్తఫా కొనుగోలు ధరలను తగ్గించడంతో సూర్యచంద్రం తన వద్ద ఉన్న సరుకును గుంటూరులోని వేరొక కంపెనీకి విక్రయించడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో సోమవారం సూర్యచంద్రం కుమారుడు అభి, డ్రైవర్ బలరాజు, దుర్గారావులతో కలిసి పొగాకు లోడు వాహనంలో కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు బయలుదేరారు. ప్రయాణంలో ఉండగా ముస్తఫా కుమారుడు బషీర్, ఆయన అనుచరులు తమ వాహనాన్ని వెంటాడి నూజివీడు సమీపంలో అడ్డుకున్నారని, వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని తమను కిడ్నాప్ చేశారని అభి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ వెంటనే ఫోన్ సంభాషణ హఠాత్తుగా నిలిచిపోవడంతో ఆందోళన చెందిన సూర్యచంద్రం తక్షణమే పోలీసులను ఆశ్రయించారు.

బాధితులను గుంటూరు జిల్లా పెదకాకానిలోని పొగాకు గోదాములకు తరలించి ఉంటారని నూజివీడు పోలీసులు అనుమానించారు. వెంటనే పెదకాకాని పోలీసులను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఏవైనా ఆర్థిక వివాదాలు ఉంటే చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి తప్ప కిడ్నాప్‌లకు పాల్పడటం తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల గాలింపుతో ఒత్తిడి పెరగడంతో మంగళవారం నిందితులు బాధితులను పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి లొంగిపోయారు. అనంతరం ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ పరారీలోకి వెళ్లగా.. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ముస్తఫాను గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu