Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువతి గర్భాన్ని దాచేందుకు దారుణం.. శిశువును పెంట కుప్పలో పూడ్చి పెట్టిన కుటుంబం

యువతి గర్భాన్ని దాచేందుకు దారుణం.. శిశువును పెంట కుప్పలో పూడ్చి పెట్టిన కుటుంబం

ధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికాని యువతి గర్భం దాల్చిన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు పుట్టిన శిశువును సజీవంగా పశువుల పెంట కుప్పలో పూడ్చిపెట్టారు.

ఈ దారుణ ఘటనకు పాల్పడిన అనంతరం కుటుంబ పరువు పోయిందనే మనస్తాపంతో చిన్నారి తాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

వారసెవోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సమయంలో శిశువు రోదనలు విన్న గ్రామస్తులు ఆ ఇంటి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆశా వర్కర్ జోక్యం చేసుకుని ఆ ఇంటిలోని పెళ్లికాని యువతి బిడ్డకు జన్మించినట్లు వెల్లడించింది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, నైబ్ తహశీల్దార్, వైద్య బృందం శనివారం ఆ గ్రామానికి చేరుకుని పేడ కుప్పలో పూడ్చిపెట్టిన నవజాత శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. చిన్నారి నోరు, మెడకు గుడ్డ కట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి అసలు కారణాలు తెలుస్తాయని వారసెవోని ఎస్‌డీఓపీ అభిషేక్ చౌదరి వెల్లడించారు. ఈ ఘటన జరిగిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన యువతి తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu