దేశ రాజదాని డిల్లీలో నాలుగు లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వలసకూలిలకు తాత్కాలిక వసతి,భోజన సదుపాయం కల్పిస్తామని ఆయన అన్నారు. దిల్లీలోని వసతి శిబిరాల్లో వలస కూలీలు ఉండాలని కేజ్రీవాల్ కోరారు. వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు. దీని కోసం ఆటల మైదానాలు, పాఠశాలలను షెల్టర్లుగా వాడతామని ఆయన చెప్పారు.లాక్ డౌన్ ను విజయవంతం చేస్తే కరోనాపై గెలుస్తామని ఆయన అబిప్రాయపడ్డారు.

