Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయ్యో దేవుడా. బడికే వెళ్లి టీచర్‌ను ఘోరంగా హత్య చేసిన వైనం. భర్త వచ్చాడని అబద్ధం చెప్పి. అరుస్తున్నా వినకుండా పొడిచి చంపిన 21 ఏళ్ల ఉన్మాది. గుండెలను పిండేసే ఘటన.!

అయ్యో దేవుడా. బడికే వెళ్లి టీచర్‌ను ఘోరంగా హత్య చేసిన వైనం. భర్త వచ్చాడని అబద్ధం చెప్పి. అరుస్తున్నా వినకుండా పొడిచి చంపిన 21 ఏళ్ల ఉన్మాది. గుండెలను పిండేసే ఘటన.!

రీదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో, సంధ్య అనే 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు, తనను నిరంతరం వేధిస్తూ వెంటపడిన అమిత్ అనే 21 ఏళ్ల యువకుడి చేతిలో కత్తిపోట్లకు గురై దారుణంగా హత్య చేయబడింది.

ముఖానికి గుడ్డ కట్టుకుని పాఠశాలకు వచ్చిన నేరస్థుడు అమిత్, టీచర్ భర్త వచ్చాడని పాఠశాల సిబ్బందితో అబద్ధం చెప్పి ఆమెను పాఠశాల ప్రధాన ద్వారం వద్దకు రప్పించాడు. ఆ మాటలను నమ్మి సంధ్య టీచర్ బయటకు వచ్చిన మరుక్షణమే, నేరస్థుడు తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దారుణంగా దాడి చేశాడు.

ఈ ఘటనకు ముందే, అమిత్ ఆ టీచర్‌ను నిరంతరం వెంబడిస్తూ వేధింపులకు గురిచేశాడు. దీనిపై ఫిర్యాదు చేసి, గ్రామంలో పంచాయతీ పెట్టినప్పటికీ అతడు తన వైఖరిని మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో, ఈ హత్యకు పాల్పడిన నేరస్థుడు అమిత్‌ను, సంఘటన జరిగిన 2 గంటల వ్యవధిలోనే పోలీసులు వేగంగా స్పందించి అరెస్టు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com