Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇప్పటికే 2 పెళ్లిళ్లు..! బడిలో చదువుకునే రోజుల నుంచే ప్రేమ. పెళ్లయినా మారని వివాహేతర సంబంధం. 6 ఏళ్ల కొడుకు ముఖంపై యాసిడ్ పోసి తడిసిముద్దైపోతుంటే దారుణ హత్య. పొదల్లో మహిళ శవం.. భయంకరం.!

ఇప్పటికే 2 పెళ్లిళ్లు..! బడిలో చదువుకునే రోజుల నుంచే ప్రేమ. పెళ్లయినా మారని వివాహేతర సంబంధం. 6 ఏళ్ల కొడుకు ముఖంపై యాసిడ్ పోసి తడిసిముద్దైపోతుంటే దారుణ హత్య. పొదల్లో మహిళ శవం.. భయంకరం.!

బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లాలో మహిళ మంజు కుమారి మరియు ఆమె 6 ఏళ్ల కుమారుడు ఆర్యన్ కుమార్ దారుణంగా హత్యకు గురైన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

గత జూలై 27న తోట సమీపంలోని పొదల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, తర్వాత ఆమె గాంధీ ప్రాంతానికి చెందిన మంజు కుమారి అని నిర్ధారించారు.

దీనిపై మంజు కుమారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి తీవ్రంగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో మొదట హరి పాస్వాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు, ఆ తర్వాత పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, మంజు కుమారి ప్రియుడైన వికాస్ కుమార్‌ను అరెస్టు చేసి విచారించారు.

విచారణలో మంజు కుమారికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని, పాఠశాల రోజుల నుంచే వికాస్ కుమార్‌తో ప్రేమలో ఉందని తేలింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ సంబంధం కొనసాగిస్తున్న సమయంలో, మంజు మరొకరితో కూడా సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన వికాస్, గత జూలై 23న మంజును, ఆమె 6 ఏళ్ల కుమారుడు ఆర్యన్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇద్దరి ముఖాలపై యాసిడ్ పోసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది.

వికాస్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు విశున్‌పూర్ సుమేర్ ప్రాంతంలోని పొదల నుండి బాలుడు ఆర్యన్ కుమార్ మృతదేహాన్ని, ఆకుపచ్చ రంగు ద్రవం ఉన్న యాసిడ్ సీసాను, మంజు కుమారి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య సంఘటనను ఆర్యన్ కళ్లారా చూడటంతో, నిజం బయటపడుతుందనే భయంతో అతడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ జంట హత్యల ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com