విమ్స్లో కరోనా మరణాలపై సమాచార జాప్యం కొనసాగుతూనే ఉంది.. విశాఖలో ఐసోలేషన్ నుంచి అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం చివరకు స్టోర్ రూమ్లో లభ్యమైంది... కరోనావైరస్ బారినపడిన ఓ వృద్ధుడు విమ్స్లో చికిత్స పొందుతున్న సమయంలో కనిపించకుండా పోయాడు.. అయితే.. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న తన తండ్రి కనిపించకపోవడంపై ఆస్పత్రి వర్గాలను ఆరా తీశాడు కుమారుడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చివరకు తన తండ్రి ఆచూకీ లభించడంలేదని అరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చివరకు స్టోర్ రూమ్లో ఆ వృద్ధుడి మృతదేహం లభ్యం కావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు విమ్స్ డైరెక్టర్. కాగా, విమ్స్లో కరోనా రోగుల మృతదేహ అదృశ్యంమై పలు విమర్శలు ఉన్నాయి.

