బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన..
ఇక, ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా అధికారి పార్టీ వాడుకుంటోందని ఫైర్ అయ్యారు జీవీఎల్.. బీజేపీ నాయకులను, కార్యకర్తలను అధికారి పార్టీ నేతలు, పోలీసులు కూడా బెదిరిస్తున్నారన్న ఆయన.. ఉప ఎన్నికలో బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలన్న అధికార పార్టీ అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ప్రకటించారు. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో కూడా అనేక నిబంధనలను, సంప్రదాయాలను విస్మరించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని.. హైకోర్టు కూడా దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించినట్టు వెల్లడించారు బీజేపీ ఎంపీ జీవీఎల్.

