తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. తాజా కేసులతో రాష్ట్రంలో 70 వేలు దాటాయి కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 2012 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,958కి చేరింది. కరోనాతో కోలుకొని ఇప్పటి వరకు 50,814 మంది డిశ్చార్జు కాగా 576 మంది మరణించారు. గత 24 గంటల్లో 13 మంది మరణించారు. ప్రస్తుతం 19,568 యాక్టివ్ కేసులున్నాయి. 12,938 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ 532,జగిత్యాల 27, ఆదిలాబాద్ 15,భద్రాద్రి 52, భూపాలపల్లి 46,గద్వాల 48,కామారెడ్డి 75,కరీంనగర్ 41,ఖమ్మం 97, మహబూబ్ నగర్ 51, మహబూబాబాద్ 36,మంచిర్యాల 1,మెదక్ 21,మేడ్చల్ 198,ములుగు 18,నాగర్ కర్నూల్ 19,నల్లగొండ 49,నారాయణపేట 4,నిర్మల్ 9,నిజామాబాద్ 83,పెద్దపల్లి 41,సిరిసిల్ల 10,రంగారెడ్డి 188,సంగారెడ్డి 89,సిద్దిపేట 28,సూర్యాపేట 27,వికారాబాద్ 6,వనపర్తి 20,వరంగల్ రూరల్ 28,వరంగల్ అర్బన్ 127,యాదాద్రి 26 కేసులు నమోదయ్యాయి.

