Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..

Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..

NTV Telugu 4 days ago

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) భారీ ఓటమిని చవిచూసింది. ఇక ఆ పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి ఓటమి పాలయ్యారు.

ఈ ఓటమి తర్వాత టీఎంసీ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా, టీఎంసీలో చీలిక వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం టీఎంసీ తొలిసారిగా భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఈ కార్యక్రమానికి టీఎంసీ ఎమ్మెల్యేలు చాలా మంది రాలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

ఎన్నికల తర్వాత చెలరేగిన రాజకీయ హింస, వీధి వ్యాపారుల ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ టీఎంసీ బుధవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 35 మంది మాత్రమే హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తీవ్ర విభేదాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. దీనికి ముందు కోల్‌కతాలోని కాళీఘాట్‌లో టీఎంసీ ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ హాజరైనట్లు సమాచారం.

బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఎంసీ ప్రధాన నాయకులు సోవన్ దేబ్ చటోపాధ్యాయ్, నయన బెనర్జీ, కునాల్ ఘోష్, రీటాబ్రత బెనర్జీ వంటి వారు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ యాక్షన్‌పై నిరసన తెలిపారు. అయితే, పార్టీలోని సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు శోవన్‌దేబ్ చటోపాధ్యాయ్ పార్టీలో విభేదాలను ఖండించారు. మారుమూల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు చేరుకోవడం ఆలస్యమైందని కవర్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu